మన్యం న్యూస్, దుమ్ముగూడెం, నవంబర్ 3::
మిషన్ భగీరథ పైపుల ద్వారా మంచినీటిని మారుమూల గ్రామాలకు ఎటువంటి ఆటకం లేకుండా ప్రతిరోజు అందించాలని జడ్పిటిసి తెల్లం సీతమ్మ సూచించారు మండలంలోని పర్ణశాల క్రాస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి మిషన్ భగీరథ ప్లాంటేషన్ ఆమె గురువారం సందర్శించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మిషన్ భగీరథ ప్లాంటేషన్ లో గతంలో క్లోరోసిల్ కెమికల్ లీకు కావడం వల్ల అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పక్కనే ఉన్న ముసలిమడుగు పర్ణశాల సీతానగరం గ్రామస్తులకు తీవ్ర అనారోగ్యానికి గురై కారణంగా మళ్ళీ అలాంటి ఘటనలు పునవ్రతం కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు అలానే సకాలంలో మండల ప్రజలకు మంచినీటిని సదుపాయం చేయాలని అధికారులను ఆదేశించారు
Post A Comment: