CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రక్షణ లేని బడికి పంపాలంటే భయపడుతున్న తల్లిదండ్రులు

Share it:


మన్యం న్యూస్, దమ్మపేట,


నవంబర్ 17 : మండల పరిధిలోని గంగుల గూడెం గ్రామంలో మండల పరిషత్, ప్రాథమికోన్నత పాఠశాలకు పిల్లల్ని పంపాలి అంటే తల్లిదండ్రులు భయపడుతూ పంపించాల్సి వస్తుంది. ఈ పాఠశాలకు ఇరుపక్కల చేపల చెరువులు ఉన్నందున పిల్లలు ఆడుకోవడానికి విశాలమైన స్థలం లేకపోవడంతో పిల్లలకు రక్షణ కరువైనది నిత్యం ఒక కంటితో కనిపెట్టి ఉండాల్సి వస్తుందని అక్కడున్న ఉపాద్యాయుడు సున్నం ప్రసాద్ వాపోతున్నారు. ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ బడిలో చుట్టూ పారి గోడ కానీ, కంచ కానీ లేకపోవడం చాలా ప్రమాదకరంగా ఉన్నది ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులనీ స్థానికులు వాపోతున్నారు. బడి చుట్టూ నీటి సదుపాయం ఉండటం వల్ల పాములు, తేళ్లు, విషపురుగులు సంచరించే అవకాశం ఉన్నది ఏ ప్రమాదం జరగక ముందే అధికారులు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి చుట్టూ పారి గోడ కట్టించగలరని అని పిల్లల తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: