CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెరిక కులస్థులు అన్ని రంగాల్లో ముందుండాలి. : మాజీ జెట్పిటీసీ యర్రంశెట్టి ముత్తయ్య

Share it:


మన్యం న్యూస్ కరకగూడెం: పెరిక సంఘం కులస్థులు అన్ని రంగాలలో ముందుండాలని సంఘం భలోపేతానికి కృషి చేయాలని పాల్వంచ మాజీ జెట్పిటీసీ,పెరిక సంఘం రాష్ట్ర నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, తెలంగాణ ఉద్యమకారులు పెరిక సంఘం రాష్ట్ర నాయకులు తిప్పని సిద్ధులు,రాష్ట్ర ఉత్తమ రైతు గ్రహీత అంకతి. ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గం పర్యటనలో భాగంగా మణుగూరు,పినపాక, గోపాలరావు,కరకగూడెం, అనంతారం గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కరకగూడెం మండల పెరిక సంఘం అధ్యక్షులు చిట్టి వెంకటేశ్వర్లు అధ్యక్షతన కరకగూడెంలో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెరిక సంఘం కులస్థులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగంలో వెనుక పడ్డారని.రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ రైతు గ్రహీత అయిన అంకతి ఉమామహేశ్వరరావును కరకగూడెం మండల పెరిక సంఘం ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు  బొలిశెట్టి విజయభాస్కర్ ,కుంచాల రాజారాం, శ్రీధర సర్వేశ్వరరావు,నల్లపు దుర్గాప్రసాద్,ఎర్రంశెట్టి నరసింహారావు,బుడగం శ్రీనివాసరావు,తిప్పని శ్రీనివాసరావు,యగ్గడి శ్రీరాం, కరకగూడెం మండల నాయకులు చిట్టి వెంకటేశ్వర్లు, అత్తె.నాగేశ్వరరావు,పూజారి వెంకన్న,బైరిశెట్టి సూర్యనారాయణ,చిట్టి మల్లేష్,చిట్టి సతీష్,కొమ్మ సత్యనారాయణ,చిట్టి శ్రీను, ప్రసాద్,వీర నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భద్రాచలంలోని శ్రీరామచంద్రమూర్తి సన్నిధిలో డాక్టర్ ఆది మోహన్ రావు గ స్థల దాతృత్వంతో నిర్మించ తలపెట్టిన పెరిక సదన్ భవనం గురించి పెద్దలు వివరించడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: