మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి నవంబర్ 17: మండల పరిధిలోని అబ్బుగుడెం గ్రామ పంచాయతీలో మూడు నెలల నుండి రేషన్ బియ్యం ఇవ్వడం లేదని గ్రామస్తులు రోడ్డు పై బైఠాయించి నినాదాలు చేశారు. గ్రామస్థులను వివరణ అడగగా... గ్రామంలోని గత మూడు నెలల నుండి రేషన్ బియ్యం ఇవ్వడం లేదని, అడిగితే రేషన్ డీలర్ ని నియమించలేదని తాత్కాలిక డీలర్ నీ నియమించగ అతను సరిగా రేషన్ షాపుకి రావడం లేదని గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించింది తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి న్యాయం చేయాలని నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న మండల ఏంఆర్వో భద్రకాళీ సంఘట స్థలానికి చేరుకుని గ్రామస్థులకు రేషన్ వచ్చేలా చేస్తానని పర్మినెంట్ డీలర్ ను నియమించేల చేస్తానని హామీ ఇవ్వడం తో గ్రామస్థులు ధర్నా విరమించారు.
Navigation
Post A Comment: