CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ తోనే యువతకు బంగారు భవిష్యత్.

Share it:

 


  • టిఆర్ఎస్ పార్టీ తోనే యువతకు బంగారు భవిష్యత్.
  • టిఆర్ఎస్  పినపాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు మిట్టపల్లి సాగర్ యాదవ్

మన్యం న్యూస్ కరకగూడెం, నవంబర్ 17.. టిఆర్ఎస్ పార్టీతోనే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మిట్టపల్లి.సాగర్ యాదవ్ అన్నారు. గురువారం మండలపరిధిలోని రఘునాధపాలెం గ్రామపంచాయతీలో టిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో యువజన విభాగం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ పినపాక నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు మిట్టపల్లి.సాగర్ యాదవ్ మండల అధ్యక్షులు రావుల. సోమయ్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ యువత అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ఎంతొ కృషి చేస్తున్నారన్నారు. యువత సమాజంలో రాజకీయ రంగంలో ముందుండాలని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి పినపాక నియోజికవర్గం అభివృద్ధి పథంలో ముందుకి తీసుకెళ్తున్నారని అన్నారు. రఘునాధపాలెం గ్రామపంచాయతీ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా సోలం.రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా పోలబోయిన. నాగేష్,కావేరి.శ్రీను  వీరితోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన. నరసింహారావు,ఉప సర్పంచ్ అక్కిరెడ్డి.మాధవి, నాయకులు రేగ సత్యనారాయణ పోలబోయిన పాపారావు ముత్తయ్య సాయికిరణ్, చిట్టిమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: