ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు.....
- రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు : ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. ఆయన ఆదివారం మణుగూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. ఆసుపత్రిలో వార్డులన్ని తిరిగి చికిత్సలు పొందుతున్న వారిని పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు ఎంతో మెరుగుపడుతున్నాయని ఇతర మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చోరవతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగు అయిన వైద్య సేవలు ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసేదెందుకు అత్యధిక నిధులు కేటాయిస్తామన్నారు. వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రిలో ఉండే రోగులకు భోజనం అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు.
Post A Comment: