- సారపాకలో ఘోర రోడ్డు ప్రమాదం
- - టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి
- - బాధితులను ఓదార్చిన ఎమ్మెల్యే రేగా
మన్యం న్యూస్, సారపాక నవంబర్ 20, ..
టిప్పర్ లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం సారపాకలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... సారపాక గ్రామంలోని ఒడియా క్యాంప్ కాలనీకి చెందిన బోన్ సింగ్ (35) అనే వ్యక్తి సారపాక మసీదు రోడ్ నుంచి రోడ్డు దాటుతుండగా భద్రాచలం నుండి సారపాక వైపుగా వెళుతున్న టిప్పర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో మృతుడి శరీరం అంతా నుజ్జు నుజ్జు అవ్వడంతో సంఘటన చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వివరాలు తెలుసుకున్న బూర్గంపాడు ఎస్సై రమణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే రేగా
బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటన సంబంధించి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించే కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు అధికారులను ఆదేశించారు.
Post A Comment: