- మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా
-దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మెచ్చా.
- అనంతరం మండల కేంద్రంలో గల రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాది ముభారాక్ చెక్కుల పంపిణీ.
*మన్యం న్యూస్, అన్నపురెడ్డిపల్లి నవంబర్ 19 :మండల కేంద్ర పరిధిలో గల నర్సాపురం గ్రామ పంచాయతీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అశ్వారావుపేట నియోజక వర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు. ఆనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులూ దళారుల చేతిలో మోసపోవద్దనీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర "a"గ్రేడ్ రకం 2060 /-, సాధారణ రకం 2040 రూపాయలు ధర ను ప్రకటించిందని కాబట్టి రైతులూ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, మండల వైస్ ఎంపీపీ మామిడిపల్లి రామారావు, వ్యవసాయ కమిటీ ఛైర్మెన్ భింరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏంఆర్వో భద్రకాళీ, మండల నాయకులు పర్సా వెంకటేశ్వరరావు, వాడే రాంబాబు,కార్యకర్తలు తది తరులు పాల్గొన్నారు.అనంతరం
అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రం లో గల రైతు వేదికలో కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేశారు.
Post A Comment: