మన్యం న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంలోని గోపాల్ రావు పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవి వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ మద్దతు ధర పకారం, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారపట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డా శ్రీనివాస్ రెడ్డి, ఎంపిడిఓ శ్రీనివాసులు, తోగ్గూడెం ఉపసర్పంచ్ బుస్సీ. శ్రీనివాస్, పినపాక సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు రామచంద్రు, సత్తిరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: