మన్యం న్యూస్ దుమ్ముగూడెం నవంబర్ 8::
మండలంలోని మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పత్తి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో సుమారు 26 వేల ఎకరాల భూమిలో పత్తి పంటను సాగు చేశారని వీరికి సౌకర్యంగా పత్తి మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని కోరారు. దీనివలన దళారుల చేత రైతులు మోసపోకుండా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుల్లి సూర్యచంద్రరావు, రైతు సంఘం మండల కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఖాదర్ బాబు, సాంబశివరావు, ముత్యాలరావు, రాంబాబు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: