CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆరుగాలం కష్టం దళారుల పాలు కావద్దు -జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత

Share it:

 


  • ఆరుగాలం కష్టం దళారుల పాలు కావద్దు -జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు

మన్యం న్యూస్ బూర్గంపాడు నవంబర్ 11: మండలంలోని శుక్రవారం బూర్గంపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో (ప్యాడి ప్రోక్యుర్ మెంట్) ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లక్ష్మీపురం,బంజర,కృష్ణసాగర్,సంజీవరెడ్డిపాలెం, ఇరవెండి,నాగినేని ప్రోలు,సోంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు అందరూ ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పి.ఏ.సి.ఎస్ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్మి త్వరిత గతిగా డబ్బులు పొందవచ్చని అన్నారు ఆరుగాల కష్టం దళారుల పాలు కనివ్వద్దని సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని ఆమే అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఏం.సి చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,సర్పంచ్ సోంపాక నాగమణి,ఏడి తాతారావు,బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీపురం గోవింద రెడ్డి,రైతులు సొసైటీ సిబ్బంది సీఈవో బత్తిన ప్రసాద్,ఉమర్ తిరుపతిరెడ్డి,నాగలక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: