మన్యం న్యూస్ బూర్గంపాడు నవంబర్ 19: మండలంలో నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో పోడు భూమి సర్వే చేసి గిరిజన పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని శనివారం జరిగిన పోడు రైతుల సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకపోడు గత 30 సంవత్సరాల నుంచి సాగుచేసుకుంటున్న పోడు భూమి నుంచి ఫారెస్ట్ అధికారులు నాయకపోలను
బయటికి తరిమేసి మొక్కలు వేసి భూమి లేకుండా చేసిన ఫారెస్ట్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం ఆదివాసి గిరిజనులకు సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని నిర్ణయిస్తే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు వారి భూములను సర్వే చేయకుండా భూముల్లోకి పోతే .క్రిమినల్ కేసులు పెడతామని పెడతామని బెదిరించడం అన్యాయం అన్నారు తక్షణమే ప్రత్యేక సర్వే చేసి అర్హులైన గిరిజనులకు పోడుపట్టాలి ఇవ్వాలని వారి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చింతల వరప్రసాదం, బోరం శిరీష, సంగం కృష్ణవేణి, యాటకానీ జయ, చిక్కాల కన్నయ్య, పసుల సాంబ ,చింతల రాజు, బోరం రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: