ప్రజల సమస్యల పరిష్కారమే ఎమ్మెల్యే రేగా లక్ష్యం
- జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
- 9వ రోజు కొనసాగిన అనునిత్యం ప్రజల కోసమే
సారపాక, నవంబర్ 4, మన్యం న్యూస్ :
నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి చేస్తున్నారని 9వ రోజు మన నిత్యం ప్రజల కోసమే కార్యక్రమంలో జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత పేర్కొన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అనునిత్యం ప్రజల కోసమే కార్యక్రమంలో భాగంగా సారపాక గ్రామంలోని రిక్షా కాలనీ, మేడే కాలనీ ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పిటిసి ఉదయం 6 గంటల నుండి స్థానిక టిఆర్ఎస్ నేతలతో కలిసి ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలలో నెలకొని ఉన్న సమస్యలను స్వయంగా ఆమె పరిశీలించారు. జెడ్పిటిసి తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే రేగా కాంతారావు సహకారంతో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, తెరాసా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కొనకంచి శ్రీనివాసరావు, పినపాక నియోజకవర్గ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణచందర్, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మి చైతన్య రెడ్డి, ఉపాద్యక్షులు ఆంజనేయులు, ఐటిసి సీనియర్ యూనియన్ నాయకులు దారుగా, తెరాసా సీనియర్ నాయకులు మెహన్ రావు, ఐటిసి తెరాసా కె.వి ప్రధాన కార్యదర్శి సానికోమ్ము శంకర్ రెడ్డి, మండల కార్మిక విభాగము మర్రి సాంబిరెడ్డి, వీరంరెడ్డి రామిరెడ్డి, సతీష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి తిరుపతి ఏసోబు, ఉప అధ్యక్షుడు సట్టు అంజనేయులు, ప్రధాన కార్యదర్శి భూక్య చిరంజీవి, తెరాసా పార్టీ నాయకులు బెజ్జంకి కనకచారి, మాజీ ఎంపీటీసీ బిక్షపతి మండల మహిళా అధ్యక్షురాలు లలిత, నక్క రమాదేవి, చుక్కపల్లి బాలాజీ, సారపాక టౌన్ బిసి కార్యదర్శి వల్లెపు బొబ్బిలి, సాయిబాబు, కాకాని రాంబాబు, నాగ, అరుణ్ ప్రసాద్, పంగి సురేష్, నాగ్ రవి నాగ్ సురేష్, అశోక్, ధారా నరసింహారావు, దారా వెంకటరాములు, రెడ్డి పోగు రవి, రమేష్ , భూక్య కృష్ణ, ముడ్ మని, ములకలపల్లి ప్రసాద్, రాయల నరేంద్ర, గొడ్ల రాజు, నాగ్ రవి, ఫోటోగ్రాఫర్ సురేష్, సోను, చెలికాని శివరామకృష్ణ, చింతా పృద్వి, ప్రేమ్, రాజేష్, నాగ్ సందీప్, వెంకటేశ్వర్లు, వరప్రసాద్, ఏసు చింటూ, డానియల్, మహేష్, సాంబిరెడ్డి, నారాయణ, అజయ్, వేణు, రాజేష్, జానీ, మహేష్, బలరాం, ఆకాష్, మహేష్, రమేష్, సందీప్ పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: