మన్యం న్యూస్,పినపాక:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను పినపాక మండల టిఆర్ఎస్ అభిమానులు గౌరవపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. పినపాక నియోజకవర్గాన్ని గత పాలకులు అభివృద్ధి పరంగా మరిచిపోయారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రేగ పాలనలో నియోజకవర్గం అన్ని రకాల కొత్త హంగులతో అభివృద్ధిని సంతరించుకుంది. తను చేస్తున్న సేవలను నియోజకవర్గానికి ఇదేవిధంగా కొనసాగించాలని ఆశిస్తున్నట్లు అభిమానులు తెలియజేశారు.రేగా కాంతారావు చాలా రోజుల తర్వాత, నియోజకవర్గానికి రావడంతో, నియోజకవర్గ వ్యాప్తంగా అభిమానులు రేగా కాంతారావును కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మన్యం న్యూస్ రీజినల్ మేనేజర్ దామోదర్ గౌడ్, పినపాక జేఏసి అధ్యక్షుడు శ్రీనివాస్, ఇతర టిఆర్ఎస్ అభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: