- అశ్వారావుపేటలో జనరిక్ మందుల షాపు ఏర్పాటు
- మందులపై 80 శాతం సబ్సిడీతో గొప్ప ప్రారంభం
- హాజరైన ప్రముఖులు
మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలో సామాన్య ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఔషధీ ఫార్మసీ వారు జనరిక్ మందుల షాపును ప్రారంభించారు. సమాన నాణ్యత కల మందులనే బయట షాపులో కంటే జనరిక్ మందుల షాపులో 80 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు జనరిక్ మెడికల్ షాపు యాజమాన్యం తెలిపారు. స్థానిక రింగ్ రోడ్డు సెంటర్ లోని పోలీస్ స్టేషన్ ఎదురుగా అయ్యర్ బిల్డింగ్ లో అట్టహాసంగా ప్రారంభమైన జనరిక్ మందుల షాపు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందని యాజమాన్యం తెలిపారు. అశ్వారావుపేట లో మెడికల్ మాఫియా రాజ్యమేలుతున్న ఈ తరుణంలో ఔషధీ ఫార్మసీ మెడికల్ షాప్ యాజమాన్యం ప్రజలకు అతి చేరువలో ఎటువంటి మోసాలకు తావు లేకుండా మందుల షీట్లు పై ఉన్న బార్ కోడును స్కాన్ చేసి బిల్ ఇచ్చే సౌకర్యం కల్పించడం పట్ల అశ్వరావుపేట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జనరిక్ మందుల షాపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్, గ్రామపంచాయతీ సర్పంచ్ అట్టం రమ్య, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఎప్పటినుండో అశ్వారావుపేటలో జనరిక్ మందు షాపు ఉంటే బాగుంటుందని ఎప్పుడూ ఆలోచించే వాడినని, జనరిక్ మందుల షాపు నా చిరకాల కోరికని, ఔషధీ ఫార్మసీ వారు అశ్వరావుపేటలో ఈ మందులు షాపు ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని, జనరిక్ మందుల షాపు వల్ల ప్రతి పేదవాడికి మందులు అందుబాటు ధరలో ఉంటాయని, అశ్వారావుపేట మండల ప్రజలందరూ జనరిక్ మందుల షాపు ను సద్వినియోగం చేసుకోవాలని, ఔషధీ ఫార్మసీ వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని వారు అభిలషించారు. ఈ కార్యక్రమంలో మార్ని రామారావు, అల్లూరి బుజ్జి, అల్లూరి నవీన్, ఔషధీ ఫార్మసీ యాజమాన్యం రామకృష్ణ, మోహన్ శేషు, ఇన్చార్జులు కిరణ్, జగదీష్, విజయ్, వివిధ పార్టీల నాయకులు, పట్టణ వివిధ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: