మన్యం న్యూస్, మణుగూరు: ఈ నెల 7 న వ్రాత పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులకు పోలీస్ రిక్ట్క్రూట్మెంట్ శారీరక ధారుడ్య శిక్షణ శిభిరం నిర్వహించడం జరుగుతుందని ఏరియా జీఎం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. మణుగూరు ఏరియాలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన సింగరేణి ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల పిల్లలకు, పరిసర ప్రభావిత గ్రామాల ప్రజల పిల్లలకు, నిరుద్యోగ యువతకు సింగరేణి సేవా సమితి ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు 7వ తేదీన ఉదయం 8 గంటలకు షార్ట్స్, టీషర్ట్స్, షూస్ ధరించి గ్రౌండ్ కు రావాలన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Navigation
Post A Comment: