ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ లొ చేరికలు.
👉BRS తీర్థం పుచ్చుకున్న CPI,TDP పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు.
మన్యం న్యూస్:దమ్మపేట: తాటిసుబ్బన్నగూడెంగ్రామంలో దమ్మపేట మండల కేంద్రం నుంచి
చిన్నగొల్లగుడెం గ్రామం
సుదాపల్లి గ్రామం నుంచి సిపిఐ, టీడీపీ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, 41 కుటుంబాలు
అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో BRS పార్టీ లొ చేరారు. వారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీర్ పరిపాలన బాగుండటం వల్లే BRS పార్టీ లో ఇతర పార్టీకి చెందిన వారు చేరుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడే ఏకైక నాయకుడు కేసీఆర్ అని , పార్టీ కార్య కర్తలను కంటికి రెప్పలా మిమ్మల్ని కపాడుకుంటానని, మనం అందరం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రతి ఇంటికి ఎదో ఒక రూపం లో BRS ప్రభుత్వ పథకం అందుతుందని,ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డకుల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, దమ్మపేట సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ దారా యుగంధర్,వార్డ్ మెంబర్ చిన్నంసెట్టి యుగంధర్,అబ్దుల్ జిన్నా, పండూరీ వీరబాబు,రొయ్యల కుమార్, స్యంసన్,సాగర్,పసుపులేటి రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: