మన్యం న్యూస్ చర్ల:
చర్ల మండలం ఆర్.కొత్తగూడెం గ్రామ పంచాయతీ నందు ఐ టి సి బంగారు భవిష్యత్తు మరియు వాషింగ్ మిషన్ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు హోమ్ కంఫోర్ట్స్ తయారీ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మహిళలకు వంటింటి వ్యర్థాలు ద్వారా ఎరువులను తయారు చేయు విధానం,పద్ధతుల గురించి వివరించడం జరిగింది.ఈ విధానం ద్వారా రసాయన రహిత కూరగాయలు పెంచి పర్యావరణ కాలుష్యాన్ని నివారించవచ్చు అని వివరణాత్మకంగా తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ లక్ష్మణ్, సెక్రెటరీ సందీప్,మహిళా సంఘ సభ్యులు,వాష్ సభ్యులు వెంకటేశ్వరరావు,సి ఓ ముత్యాల రావు, ప్రసాద్,గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: