మన్యం న్యూస్,భద్రాచలం:
జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులతో ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు,భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ ఐపిఎస్ సూచనలతో భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సీలేరుకు చెందిన కోర్రాడ దారబాబు (08 కేసులలో నిందితుడు) మరియు ఖమ్మం కి చెందిన ముత్తినేని కిషన్ కుమార్ (04 కేసులలో నిందితుడు) ఇట్టి ఆరితేరిన గంజాయి గాళ్ళపై పీడీయాక్ట్ కేసు నమోదు చేసి,అదుపులోకి తీసుకున్న అనంతరం చర్లపల్లి సెంట్రల్ జైలు,హైదరాబాద్ నకు తరలించడం జరిగిందని భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి తెలిపారు.
Post A Comment: