CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆధార్ నవీకరణ తప్పనిసరి : జిల్లా కలెక్టర్ అనుదీప్.

Share it:


మన్యం న్యూస్,కొత్తగూడెం:

ఆధార్ నవీకరణ తప్పనిసరి జిల్లా కలెక్టర్ అనుదీప్. 2015 సంవత్సరం కన్నా ముందు ఆధార్ కార్డు తీసుకున్న  వారు  తప్పనిసరిగా నవీకరణ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఆధార్ నవీకరణపై శుక్రవారం  జిల్లా కలెక్టర్ ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకానికైనా ఉద్యోగ దరఖాస్తు,  ప్రభుత్వ పథకాల అమలు, లబ్దిదారులు ఎంపిక, బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలకు, స్థలాల రిజిస్ట్రేషన్లకు, సిమ్ కార్డుకు, రేషన్ కార్డులకు, స్కాలర్ షిప్ పొందుటకు ఇలా పౌర సేవలన్నింటికీ ఆధార్ కార్డును తప్పనిసరి చేశారని చెప్పారు. 2015 కంటే ముందు ఆధార్ కార్డు పొందిన ప్రతి ఒక్కరూ 

యు ఐ డి ఏ ఐ (UIDAI) ఆదేశాల మేరకు తగిన గుర్తింపు పత్రంతో స్థానికతను మరోసారి నవీకరించుకోవాలని కలెక్టర్  కోరారు.

ఆధార్ ఆధారంగా కొనసాగుతున్న సేవలను భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పొందాలంటే ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరిగా పునరుదించుకోవాలని కలెక్టర్ అన్నారు. (UIDAI) ఆదేశాలు మేరకు అన్ని ఆధార్ నమోదు కేంద్రాల్లో కేటాయించిన రుసుముతో సేవలను పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.

 ఈ మేరకు తగు చర్యలు చేపట్టాలని ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ విజయ సారధిని కలెక్టర్ ఆదేశించారు.

Share it:

TELANGANA

Post A Comment: