జూలూరుపాడు, అక్టోబర్ 28, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని కాకర్ల గ్రామంలో ఇటీవల ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు వందనపు సత్యనారాయణ పై దాడి జరిగి గాయపడిన సంగతి పాటకులకు విధితమే, హైదరాబాద్ హాస్పటల్లో ఆపరేషన్ అనంతరం వారి స్వగృహం కాకర్ల గ్రామానికి వచ్చిన తరువాత, వారిని పరామర్శించడానికి శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల చంద్రశేఖర్, కోశాధికారి చింతల వినోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపుతు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఇల్లందుల వెంకటేశ్వర్లు, మరియు భద్రాచలం నియోజకవర్గం చైర్మన్ ఉడతా నగేష్ కుమార్, కొత్తగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ కూర శ్రీధర్, భద్రాచలం కొంజర్ల ఉమామహేశ్వరరావు, కొత్తగూడెం ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి రేపాక రాజ మనోహర్, సుజాతనగర్ కొండూరు సందీప్, జూలూరుపాడు మండల ఆర్యవైశ్య ప్రముఖులు మహంకాళి గోపాలకృష్ణ, కంచర్ల రామారావు, సీమకుర్తి కేశవరావు, వందనపు కమలాకర్ రావు, ఉడత సూర్య ప్రకాష్ రావు, చిట్లూరి మహేష్, వేముల నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వర్లు, ఉడతా కృష్ణారావు, ఉడతా జగదీష్, కొదుమూరి కరుణాకర్, దూపకుంట్ల సత్యనారాయణ, చిట్లూరి నరసింహారావు,లు పరామర్శించిన వారిలో ఉన్నారు.
Navigation
Post A Comment: