మన్యం న్యూస్, గుండాల (28): అమరుల త్యాగాలు మరువలేనివని గుండాల ఎంపిపి ముక్తి సత్యం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ ఒకటో తారీకు నుండి తొమ్మిదో తారీఖు వరకు జరుగు అమరవీరుల వర్ధంతి సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతూ అమరులైన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాల్సిన అవసరం మనపై ఉందన్నారు. ప్రజలుఅమరుల వర్ధంతి సభలలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కుండాల సర్పంచ్ సీతారాములు. ఉప సర్పంచ్ ఉపేందర్, గుండాల సైడ్ డివిజన్ కార్యదర్శి నరేష్ , వై వెంకన్న , గడ్డం లాలయ్య, ఈసం కృష్ణ , అజ్జర్ , పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు రాజేష్, ఐఎఫ్టియు నాయకులు కిరణ్, రవి తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: