CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఐ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్.. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక..

Share it:


జూలూరుపాడు, అక్టోబర్ 28, (మన్యం న్యూస్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్ ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులతో మాట్లాడుతూ ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా, ప్రజల రాకపోకలకు అడ్డంకు లేర్పర్చకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఆకతాయిలు, అసాంఘిక కార్యక్రమాలు, అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంటుందని తెలిపారు. యువకులు బైకులపై పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ విన్యాసాలు చేసి, ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తే వారిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలంతా శాంతియుతంగా మెలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పోటు గణేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: