జూలూరుపాడు, అక్టోబర్ 29, (మన్యం న్యూస్): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని పడమట నర్సాపురంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుప్పాల నాగేశ్వరరావు అనే రైతు పత్తి చేలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని, తవ్విన ప్రదేశంలో రక్తపు మరకలు, పసుపు, కుంకుమ, అగరొత్తులు, నిమ్మకాయలు, ముగ్గులు పోసి, కొత్త బట్టలు పెట్టిన ఆనవాళ్లను గుర్తించామని తెలిపారు. సుమారు నాలుగు అడుగుల పొడవు గుంటను తవ్వి పూడ్చి ఉందని తెలిపారు. శనివారం యధావిధిగా పత్తి తీయడానికి వెళ్లిన స్థానికులు ఇది గుర్తించి భయభ్రాంతులకు గురయ్యామని తెలిపారు.
Navigation
Post A Comment: