మన్యంన్యూస్,(అక్టోబర్22) గూడూర్ :మండలం పరిధిలోనితీగలవేణి గ్రామంలో కొమురంభీమ్ యూత్ ఆధ్వర్యంలో కొమురం భీమ్ జయంతి కార్యక్రమంలో భాగంగా ముందుగా గ్రామ దొర పటేల్ పోనక సురేందర్ సోలం సారయ్య కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాల వేసి జండా ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన గొప్ప మహనీయుడు అని కొనియాడారు ఆదివాసీ ప్రజానీకం ఎంతో కొంత ఈ రోజూ ఇలా ఉన్నామంటే అది మన మన్యం పులి కొమురం భీమ్ చలువే అని గుర్తుచేశారు అలాంటి మహానియుడను మనం ఎప్పటికి మర్చిపోకూడదు మన వెనుకా తరం పిల్లలకు కూడా కొమురం భీమ్ పొరటస్ఫూర్తి తెలియజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొమురం భీమ్ యూత్ అధ్యక్షులు పోనక మధు కార్యదర్శి పోనక చంటిదొర పడిగ శ్రీను గ్రామస్తులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: