సారపాక, అక్టోబర్ 22, మన్యం న్యూస్ :
గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత స్థానిక ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. శనివారం సారపాక పట్టణం లోని పలు కాలనీలలో జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పర్యటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ పట్టణ వాసులతో మాట్లాడి వారి సమస్యలను గురించి విచారించారు. రోడ్ల సమస్య, త్రాగునీటి సమస్య, డ్రైనేజి సమస్యలు, కరెంట్ స్తంభాల ఏర్పాటుపై కాలనీ ప్రజలను అడిగి తెలుసుకొన్నారు.
సమస్యల పరిష్కారం దిశగా స్థానిక అధికారులతో మాట్లాడి పనులను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, తెరాసా పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మండల మహిళా అధ్యక్షురాలు లలిత, టీ.ఆర్.ఎస్.వి నాయకులు సానికొమ్మ శంకర్ రెడ్డి, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలి శ్రీహరి, ప్రధాన కార్యదర్శి ఏసోబు, పినపాక నియోజకవర్గం యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లకోటి పూర్ణ, సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ సోము లక్ష్మీ చైతన్యరెడ్డి, సారపాక టౌన్ ఉపాధ్యక్షులు ఆంజనేయులు, మండల మైనారిటీ ప్రధాన కార్యదర్శి గుల్ మహమ్మద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీను, యూత్ ప్రధానకార్యదర్శి భూక్యా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: