మన్యం న్యూస్ వాజేడు: అక్టోబర్ 22: మండల పరిధిలోని ఏడుజర్లపల్లి గిరిజన ఇసుక సొసైటీ ర్యాంపు వద్ద ఏడుజర్లపల్లి, కొత్తూరు. ముత్తారం గ్రామాల గిరిజనేతరులు, ఇసుక లారీలను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే వాజేడు మండలం ఏడుజర్లపల్లి కొత్తూరు, ముత్తారం గ్రామాల్లో 50 ఆదివాసి కుటుంబాలతో మైసమ్మ ఇసుక సొసైటీనీ ఏర్పాటు చేసుకున్నారు. గిరిజన ఇసుక సొసైటీల పైన పూర్తి హక్కులు ఆదివాసీలకే కల్పించబడ్డాయి అని చట్టాలే చెప్పుతున్నాయనీ స్థానిక ఆదివాసిల ప్రజల వాదన వినిపిస్తోంది.అయినా గిరిజనేతరులు ఇసుక లోడు లారీలను అడ్డగిస్తున్నారనీ గిరిజనులు వాపోతున్నారు.గిరిజన సొసైటీలలో గిరిజనేతరులకు హక్కు ఎవరిచ్చారు అని ఆదివాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో పలు గ్రామాలలో గిరిజనేతర కుటుంబాలు,గిరిజనేతరుల గ్రామాలు ఉన్నాయని, మేము చెప్పిందే చేయాలని స్థానిక ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఏడుజర్లపల్లి గ్రామంలో సంతరించుకుంది.ఆదివాసి చట్టాలను ఉల్లంఘన చేస్తే సహించేది లేదని గ్రామ ప్రజల సమక్షంలో స్థానిక సర్పంచ్ కి విన్నవించారు.
Navigation
Post A Comment: