మన్యం న్యూస్, దుమ్ముగూడెం ,అక్టోబర్ 21::
మండలంలోని పాత మరుడుబాక గ్రామంలో ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆర్లగూడెం ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోసం వీరమ్మ ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఉషారాణి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయుర్వేదం వైద్యం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని అల్లోపతి వైద్యం కంటే ఆయుర్వేద వైద్యం గొప్ప ప్రాచీన వైద్యం అని డాక్టర్ ఉషారాణి తెలిపారు ప్రజలందరూ ఆయుర్వేద వైద్యం పై అవగాహన కల్పిస్తూ వివిధ దీర్ఘకాలిక రోగాల బడిన వ్యాధిగ్రస్తులకు బీపీ షుగర్ శ్రీ సంబంధిత వ్యాధులకు పరీక్షించి మందులను పంపిణీ చేశారు ఈ వైద్య శిబిరంలో 181 మందిని పరీక్షించి ఉచితంగా మందులను అందించారు ఈ యొక్క కార్యక్రమంలో నరసాపురం ఆయుష్ వైద్యులు డాక్టర్ జ్యోతి సిబ్బంది వీరభద్రం ఈశ్వరి నరసపురం ప్రాథమిక కేంద్రం సిబ్బంది హెచ్డి రాంబాబు ఏఎన్ఎం పూర్ణ ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: