CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వేతనాలు,ఏరియర్స్ తక్షణమే చెల్లించాలి : సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికుల నిరసన

Share it:


 మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 21: .....కొత్తగూడెం సింగరేణి డైరెక్టర్స్ బంగ్లోస్ వద్ద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు , పెండింగ్ లో ఉన్న ఏరియర్స్ తక్షణమే చెల్లించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం సకాలంలో వేతనాలు చెల్లించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బ్యాంకు సెలవులు దీపావళి పండుగ నేపథ్యంలో తక్షణమే వేతనాలు,పెండింగ్ ఏరియర్స్ చెల్లింపుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పండగ కాలంలో కాంట్రాక్టు కార్మికులను పస్తులతో ఉంచే పరిస్థితులకు దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి శ్యామ్ కుమార్,రాజ్ కుమార్,మణెమ్మ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: