మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ , అక్టోబర్ 21 : కొత్తగూడెం డిపో నుండి ప్రతిరోజు విద్యార్థుల కోసం చండ్రుగొండ మండలం రేపల్లెవాడ గ్రామానికి సరియైనా సమయానికి నడపాలని టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు భూపతి శ్రీనివాసరావు ఆర్టీసీ అధికారులను కోరారు. శుక్రవారం కొత్తగూడెం డిపో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సునీత కు విద్యార్థులతో కలిసి ఆయన వినతిని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు ఉదయం 8:00 కల్లా రేపల్లెవాడ గ్రామానికి ఆర్టీసీ బస్సు వస్తే, చుట్టు ప్రక్కల గ్రామాలైన గానుగపాడు, అన్నారతండా, సత్యనారాయణపురం, శ్రీరాంపురం,రవికంపాడు,పోకల గూడెం, తదితర గ్రామాల నుండి విద్యార్థులు వచ్చి బస్సులో వెళ్తున్నారు. విద్యార్థులకు ఉన్నత చదువులకు దృష్టిలో ఉంచుకొని బస్సును సమయానికి నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అఖిల్,సాయి సంపత్,సాయి, వెంకటేష్,నరేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: