- అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే రాములు నాయక్..
- ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణదే మొదటి స్థానం..
- విద్యుత్ సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే..
జూలూరుపాడు, అక్టోబర్ 21, (మన్యం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను తీర్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ తెలిపారు. జూలూరుపాడు మండలంలోని పలు గ్రామపంచాయతీలలో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యను తీర్చిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలులో మొదటి స్థానంలో ఉందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం విద్యా, ఆరోగ్య, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశవ్యాప్తంగా అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్ (బి ఆర్ ఎస్) పార్టీని స్థాపించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయ నిధి లాంటి ఎన్నో కార్యక్రమాలు ప్రజాదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ఒక లక్ష 97 వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, జడ్పిటిసి భూక్య కళావతి, సొసైటీ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు యదళ్ళపల్లి వీరభద్రం, సర్పంచ్ భారతి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు, పార్టీ సీనియర్ నాయకులు రోకటి సురేష్, పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: