మన్యం న్యూస్, దమ్మపేట : మండల పరిధిలోని కొత్తూరు, పాత చీపురుగూడెం గ్రామాల్లో పోడు భూమి అశ్వారావుపేట రెవెన్యూ లో ఉండడం గ్రామస్థులు దమ్మపేట మండలంలో ఉండటం వల్ల సర్వే జరగని తరుణంలో ఈ సమస్య పరిష్కారం కోసం గ్రామస్థులు శుక్రవారం అశ్వారావుపేట ఎంఎల్ఎ మెచ్చా నాగేశ్వరరావుని వారి నివాసమైన తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో సమస్యను విన్నవించుకోవడానికి కలిశారు. ఈ సందర్భంగా వెంటనే స్పందించిన ఎంఎల్ఎ మెచ్చా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలని కోరారు అలాగే ఇరు మండలాల తహసిల్దార్లతో మాట్లాడారు, సమస్యను త్వరగా పరిష్కరించమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి రుపా, జంగం, మాజీ సర్పంచ్ సోయం ఈశ్వరమ్మ, గ్రామ పెద్దలు, పోడు సాగుదారులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: