మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 10.... అన్నం పరబ్రహ్మ స్వరూపమని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ ఆకలి తీర్చుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ కాలనీ పంచాయతీ రాంనగర్ మహంకాళి అమ్మవారి దేవాలయ భక్త బృందం పేర్కొన్నారు. ఆదివారం దసరా ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది దసరా ఉత్సవాలను మహంకాళి అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి వారి వారి మొక్కులు చెల్లించుకుని విశిష్టత పూజలను ఆచరిస్తారని పేర్కొన్నారు.
Navigation
Post A Comment: