మన్యం న్యూస్ అక్టోబర్ 9 వాజేడు. ఆర్థికంగా వెనుకబడిన వారు అభివృద్ధి చెందాలని సంకల్పంతో వ్యవసాయ రంగం లో రాణించాలని అక్కడ, ఇక్కడ అప్పులు చేసి రైతు కూలీలుగా మారుతున్న సందర్భాలు ఎన్నో. కూలీ చేసి అప్పు తీర్చలేక బలవన్ మరణాలకు దారితీస్తుంది. అలాంటిదే వాజేడు మండలం ఎడ్చెర్లపల్లి గ్రామపంచాయతీ, ముత్తారం కాలనీకి చెందిన చెన్నం, స్వామి, పురుగుల మందు తాగి మరణించారు. ఎస్సై తిరుపతిరావు వివరాల ప్రకారం ఉదయం 6 గంటలకు పురుగుల మందు తాగారని గుర్తించిన భార్య రాణి తక్షణమే వెంకటాపురం హాస్పిటల్ కి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఏటూర్ నాగారం ప్రభుత్వ హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Navigation
Post A Comment: