CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్ని మతాల గమ్యం ఒక్కటే సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా

Share it:


మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 09... సమాజంలో ఐక్యత, శాంతి, సామరస్య భావాలను పెంపొందించడమే అన్ని మతాల లక్ష్యం, గమ్యమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం పట్టణంలో రామాటాకీస్ రోడ్డు బర్లిఫిట్ ఏరియా మజీద్లో ఆదివారం మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇస్లాం, ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించి దేశ శ్రేయస్సు, అభివృద్ధి కోసం మస్జిద్ సందర్శన కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని మత విశ్వాస ప్రజలను అహ్వానించడం అభినందనీయమన్నారు. లౌకిర, ప్రజాస్వామ్య భారత దేశంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలని, ఒకరి కొకరి ఆచార, వ్యవహారాలను పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగినప్పుడే సమాజంలో శాంతి నెలకొంటుందని దిశగా మజీద్ కమిటీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు బొర్రా కేశవరావు, పిడుగు శ్రీనివాస్, రజనీకుమార్, రవి, కాలి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: