మన్యం న్యూస్ , గుండాల, అక్టోబర్ (25) : నవంబర్ ఒకటో తారీకు మండల కేంద్రంలో జరిగే అమరవీరుల వర్ధంతి సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిఓడబ్ల్యు రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ పిలుపునిచ్చారు. సభను విజయవంతం చేయాలని కోరుతూ మండలంలో ప్రజాపందా పార్టీ నాయకులతో ప్రచారం నిర్వహించారు. మండలంలో ప్రజలతో పెద్ద ఎత్తున గ్రూప్ మీటింగ్స్ లో నిర్వహించి సభను విజయవంతం చేయాలని కోరారు. ఎందరో అమరులు ఉద్యమం కోసం తమ విలువైన ప్రాణాలను అర్పించారని అలాంటి మహనీయులను స్మరించుకోవడం ప్రజలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాచర్ల సత్యం, శంకరన్న, వాంకుడోత్ అజయ్, సనప కుమార్, మంగన్న, రాజు, పుష్ప రాజ్, కోడూరి జగన్, హరికృష్ణ , కృష్ణకుమారి, బాయ్ అమ్మ, శ్రీ వాణి, మహేశ్వరి, మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: