మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 25... ప్రతి ఇంట దీపావళి వెలుగులు విరజిమ్మాలని కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ఆకాంక్షించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపాలిటీ ఆరవ వార్డు రామవరం ప్రాంతంలో ఆమె నివాస గృహంలో దీపావళి బాణసంచా కాల్చారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో వెలుగులు విరజింమాలని చెడుపై మంచి విజయం సాధించిన ఈ దీపావళి పండుగని, కొత్తగూడెం ప్రజల కుటుంబాలలో ఈ దీపావళి పండుగ వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నమన్నారు.
Post A Comment: