మన్యం న్యూస్, కరకగూడెం:మండల పరిదలోని ఐకేపి విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని ఐకెపి ఎపిఎం త్రిగుణ కు అందజేశారు. మీ సందర్భంగా విఓఏల మండల అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ గత మూడు నెలల నుండి విఓఏ లకు గౌరవ వేతనం లేక కుటుంబాలను పోషించలేక పోతున్నామన్నారు. అలాగే జీవో నెంబర్ 58 ప్రకారం గ్రామ సంఘాల నుండి ఇవ్వవలసిన రెండు వేల రూపాయల వేతనం ఇవ్వాలని అన్నారు.విఓఏ లను సెర్పూఉద్యోగులకు గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. నెలకు కనీస వేతనం 21000 అమలు చేసి, 10 లక్షల రూపాయలు సాధారణ భీమా సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిసి తాటి.ముత్యాలరావు. విఓఏ లు కల్తి. సాంబమూర్తి,నర్సింగ్.వెంకన్న,పోలెబోయిన.వెంకటేశ్వర్లు,పోలెబోయిన. ముత్తయ్య, లావణ్య, ఇర్ప.విద్యాసాగర్,భాగ్యలక్మీ. తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: