మన్యం న్యూస్, దుమ్ముగూడెం ::
ఆదివాసి గిరిజన గ్రామంలో నెలకొని ఉన్న పోడు భూముల సమస్యను త్వరితగతిగా సర్వ్ చేసి అర్హులైన గిరిజన రైతు కుటుంబాలకు అందే విధంగా సర్వే పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ ఆదేశించారు సోమవారం దుమ్ముగూడెం మండలంలో పోడు భూముల సర్వే జరుగుతున్న ఆర్లగూడెం పంచాయతీ పరిధిలోని ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే కోసం ఎని దరఖాస్తులు వచ్చాయో ఎకరాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే అంశాన్ని పరిశీలించి అధికారులు సమన్వయం పాటించి పారదర్శకంగా సర్వే చేయాలని అధికారులు తెలియజేశారు సర్వే చేసేటప్పుడు గ్రామసభలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా అందరి సంతకాలు తీసుకోవాలని సూచించారు అధికారులు గ్రామంలోని రైతులకు పూర్తిగా గ్రామసభలు నిర్వహించి వారికి అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న రైతుల భూములు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే వాటి సర్వే నిలిపివేయాలని సూచించారు ప్రతి గ్రామంలో సర్పంచ్ గ్రామ పెద్దల సహకారంతో సర్వే చేసి అందరకు హక్కు పత్రాలు ఇచ్చే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో దుమ్ముగూడెం తాసిల్దార్ చంద్రశేఖర్ బీట్ ఆఫీసర్ అన్నపూర్ణ డి టి ఆర్ ఓ శ్రీనివాస్ సర్పంచ్ సునీత తపస్సు భాగ్య నాయక్ ఉపసర్పంచ్ నరసింహారావు ఎంపీ ఓ ముత్యాలరావు కార్యదర్శి నరేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: