మన్యం న్యూస్, అశ్వారావుపేట: అశ్వారావుపేట, దమ్మపేటలలో గల పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలను ఆయిల్ఫెడ్ జనరల్ సీనియర్ మేనేజర్ సుధాకర్ రెడ్డి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే అశ్వరావుపేట పామాయిల్ ఫ్యాక్టరీకి పవర్ ప్లాంట్ ను, మరొక కొత్త పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని ఏర్పాట్లు చేయుటకు ఫ్యాక్టరీ పక్కన స్థలం పరిశీలన చేస్తున్నామని తెలియజేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని ట్రాక్టర్ డ్రైవర్లు కూర్చోవడానికి బల్లలు, షెడ్డు, వాటర్ సదుపాయము ఏర్పాటు చేస్తామని అలాగే ఎఫ్ కోడ్ విషయంలో సమస్యలను కూడా పరిష్కారం చేస్తామని తెలియజేశారు. 29, 30 వ తారీకు లోని వచ్చిన గెలలు 1 తారీకు అన్ లోడ్ అయిన వాటికి కొత్త రేటు ప్రకారం పేమెంట్లు పడ్డాయని వాటికి మేము చేసేది ఏమీ లేదు అని వాటి విషయంలో చైర్మన్ దగ్గర పరిశీలనలో ఉంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో మేనేజర్లు, ఫ్యాక్టరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: