మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 17... వ్యాపార రంగంలో రోజురోజుకు పెరుగుతున్న పోటీతత్వాన్ని ఎదుర్కొని దినదినాభివృద్ధి చెందాలని.. ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆకాంక్షించారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం లోని మహేంద్ర షో రూమ్ లో బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం రాంబాబు కొనుగోలు చేసిన మహేంద్ర స్కార్పియో నూతన వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార రంగంలో రోజురోజుకు సరికొత్త ఒరవడిని సృష్టించి అందరిలో అగ్రగామిగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం మహీంద్రా షోరూమ్ యాజమాన్యం ఎమ్మెల్యే రేగాను ఘనంగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: