మన్యం న్యూస్ గుండాల (10) ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. సోమవారం మండలం పరిధిలోని లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ఆధునికరించే పనులను ఆమె పరిశీలించారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తగ్గకుండా వసతులతో పాటు విద్యను అందించడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖయ్యూం, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: