CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కొమరం భీమ్ 82 వ వర్ధంతి ఘనంగా నిర్వహించినారు.

Share it:

 


మన్యం న్యూస్ అక్టోబర్ 9 వాజేడు. : 

 మండల కేంద్రంలో కొమరం భీమ్ 82వ వర్ధంతి   కార్యక్రమాని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నుగూరు వెంకటాపురం(చర్ల) వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోదెబోయన బుచ్చయ్య హాజరై కొమరం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ చరిత్ర చూసినట్లయితే భారతదేశానికి స్వాతంత్ర్యం కొరకు మొదటి మెట్టుగా ఉద్యమ పోరాటం చేసిన వారు ఆదివాసీలే, ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఆదివాసి వీర యోధులు ఉద్యమాలు చేశారు. ఆదివాసీల కోసం కొమరం భీం చేసిన త్యాగాలను ప్రతి ఆదివాసి గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కొమురం భీం ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్క ఆదివాసి కొమరం భీమ్మై ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాజేడు మండలం బిఆర్ఎస్ అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణారెడ్డి తుడుం దెబ్బ ములుగు జిల్లా కార్యదర్శి బిఆర్ఎస్ నాయకులు పాయం జానకి రమణ వాజేడు మండలం టిఆర్ఎస్ అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య మండల బి ఆర్ ఎస్ ప్రచార కార్యదర్శి రాణి మేకల రాంబాబు గుమ్మడిదొడ్డి మాజీ సర్పంచ్ కారం వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ నాయకులు సెగ్గం ప్రశాంత్ కోరం సత్యం మడప నాగరాజు చెన్నం శ్రీను నాగారం పంచాయతీ సిబ్బంది చెన్నం ఆదినారాయణ వీఆర్వో సంఘం వాజేడు అధ్యక్షుడు కుందమల్ల సురేష్ సౌరపు రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: