మన్యం న్యూస్ ప్రతినిధి, చండ్రుగొండ : మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సదస్సులో కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారి శాంత కుమారి మాట్లాడుతూ... బాల్యవివాహాల నిరోధక చట్టం 2006, బాలికలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2012, విద్య, రక్షణ, సంరక్షణ, సేవ్ ద గర్ల్ అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తూ, సమాజంలో అన్ని రంగాలలో బాలికలు, మహిళలు ముందు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ శకుంతల, రాణి, అంగన్వాడి టీచర్లు, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: