మన్యం న్యూస్, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు 207 కంపార్ట్మెంట్ గత 30 సంవత్సరాలుగా పోడు రైతులు ఇబ్బంది పడుతున్నా పోడు భూముల సర్వేలను ఫారెస్ట్ అధికారులతో కలిసి సర్వే నిర్వహించిన అశ్వాపురం మండల జడ్పిటిసి సుదిరెడ్డి సులక్షణ,మల్లెలమడుగు సర్పంచ్ కోడి కృష్ణవేణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడు రైతుల కళ ఇన్నాళ్లకు నెరవేరుతుందని, ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని, సీఎం కేసీఆర్ కి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ గుంపెనా శ్రీను,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్,మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపి రెడ్డి,కుంజ భాస్కర్,మల్లెలమడుగు కార్యదర్శి బిందు,ప్రభుత్వ సర్వేయర్ రాజు,పోడు రైతులు,పద్దం భద్రయ్య,గుండు వెంకటమ్మ,బుల్లి సమయ్య,పాయం కామయ్య,గుంపేనా నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: