మన్యం న్యూస్, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దివ్యాంగులకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) అలింకో సంస్థ సహకారంతో బుధవారం నాడు పరికరాలను పంపిణీ చేయనున్నారు. మణుగూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సిడిపిఓ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పరికరాలను పంపిణీ చేయనున్నారు. మణుగూరు, పినపాక, అశ్వాపురం, గుండాల మండలాలకు చెందిన దివ్యాంగులు బుధవారం నాడు మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వివిధంలో పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు. శిబిరమునకు వచ్చే దివ్యాంగులు వారి వెంట వైద్య ధ్రువీకరణ పత్రము, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ జిరాక్స్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు ఫోటోలు, సమాచారం కొరకు ఫోన్ నెంబర్ తీసుకురావాలని సిడిపిఓ జయలక్ష్మి తెలియజేశారు. వారి అర్హతను బట్టి పరికరాల అందజేత ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు
Post A Comment: