మన్యం న్యూస్, అశ్వారావుపేట: తొమ్మిది రోజుల బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా అశ్వరావుపేట మండలం, జమ్మి గూడెం గ్రామంలో బతుకమ్మ సంబరాలు కార్యక్రమానికి శనివారం సాయంత్రం ముఖ్య అతిథులుగా దివంగత మాజీ ఎమ్మెల్యే వగ్గెల మిత్ర సేన మనవరాలు, టిపిసిసి మెంబర్ వగ్గెల పూజ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ కమిటీ అధ్యక్షురాలు, అశ్వరావుపేట ఎంపీటీసీ వేముల భారతి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు వారిని సాల్వలతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా జమ్మిగూడెంలో ప్రత్యేక ఆలయంలో ఏర్పాటుచేసినా దుర్గమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జమ్మిగూడెం గ్రామ మహిళలతో బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం బతుకమ్మలు తెచ్చిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది రోజులు నిర్వహించే బతుకమ్మ సంబరాల సందర్భంగా తమనీ గ్రామానికి ఆహ్వానించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ అమ్మవారి ఆశీస్సులతో అందరూ చల్లగా ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జమ్మి గూడెం గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: