మన్యం న్యూస్, పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేటలో గ్రామంలో భద్రాచలం లోని లూథరన్ చర్చ్ ఆధ్వర్యంలో, ఉచిత మెగా వైద్య శిబిరంను ఉన్నత పాఠశాలలో స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ అలీనా శాంతి వైద్య పర్యవేక్షణలో రోగులను పరీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రోగులకు షుగరు, గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రవివర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, కిమ్స్ ఆసుపత్రి జనరల్ సర్జన్ ఫరీద్, ఇతర వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: