మన్యం టీవీ, చర్ల :
ఇచ్చిన మాటకు కట్టుబడి గిరిజన బిడ్డలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి చర్ల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు, మరియు మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు కాపుల నాగరాజు ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు
తెలంగాణ రాష్ట్ర గిరిజనుల తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో చర్ల టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఇరస వడ్ల రాము, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కొసరాజు రాజా, బిసి సెల్ అధ్యక్షులు దొడ్డి సూరిబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్, మాజీ ఎంపీటీసీ ఆలం ఈశ్వర్, కవ్వాల రాము, గోరింట్ల వెంకటేశ్వరరావు, కట్టం కన్నారావు, ముప్పిడి సోమరాజు, సింగ సంతోష్,నీలం వెంకటరమణ, గిరిజన సంఘం నాయకులు శ్యామల నాగయ్య, పాయం చిట్టిబాబు, పాయల ఆదినారాయణ, కల్లూరి పాపారావు, ప్రభాకర్, మహేష్, నాగరాజు, రామకృష్ణ, గిరిజన సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Post A Comment: