CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఎంతో ఉపయోగకరం. సీఎం కేసీఆర్ కి లబ్ధిదారుల ప్రత్యేక కృతజ్ఞతలు.

Share it:


మన్యం న్యూస్, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా మండలంలో అన్ని కులాల వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అశ్వాపురం మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు మండలంలో 1095 మంది లబ్ధిదారులకు 10,39,75,640 అక్షరాల 10 కోట్ల 39 లక్షల 75 వేల 640 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కు రూపంలో  వారి ఖాతాలో జమ చేయడం జరిగినది. మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధి పొందిన లబ్ధిదారుల కులాల వారీగా ఎస్సీ 175, ఎస్టి 422, బిసి 371, ఈ బీసీ 83, ఎస్ ఎం 44, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా లబ్ది పొందిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 1095. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ది పొందిన లబ్ధిదారులు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉందని వారు తెలియజేశారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు వారికి ఎప్పుడు రుణపడి ఉంటామని వారు తెలియజేశారు. నిరుపేద కుటుంబం పిల్లలకు పెళ్లి చేయాలంటే బయట అప్పు తెచ్చి చేయవలసి వస్తుందని, ఇప్పుడు మాకు ఆ సమస్య లేదని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్ధి పొందిన లబ్ధిదారులు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: